న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ ప్రదర్శన చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని ఈడీ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సుబోధ్ కాంత్ సాహా మాట్లాడారు. అగ్నిపథ్ స్కీమ్ విషయంలో ప్రధాని మోదీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మోదీ ఒకవేళ హిట్లర్ తరహాలో పాలన కొనసాగిస్తే, అప్పుడు మోదీ కూడా హిట్లర్ తరహాలో చనిపోతారని ఆయన అన్నారు.
#WATCH | Modi will die Hitler's death if he follows his path, says Congress leader Subodh Kant Sahay at party's 'Satyagrah' protest against ED questioning of Rahul Gandhi & Agnipath scheme in Delhi pic.twitter.com/fO8LfRShvK
— ANI (@ANI) June 20, 2022
మాజీ మంత్రి చిదంబరం సెటైర్ వేశారు. మీరు పకోడీలు వేయడం నేర్చుకోవాలంటే, అప్పుడు అగ్నివీరులు కావాలంటూ కామెంట్ చేశారు. ఒకవేళ సైనికుడు కావాలనుకుంటే, అప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని చిదంబరం అన్నారు. డ్రైవర్, వాషర్మాన్, బార్బర్ కావాలనుకుంటే, అగ్నివీర్ కావాలని, చౌకీదార్గా కావాలన్నా అగ్నివీర్ కావొచ్చు అని చిదంబరం అన్నారు.