న్యూఢిల్లీ, అక్టోబర్ 22: కరోనా టీకాల పంపిణీలో 100 కోట్ల మైలురాయి నవ భారతానికి ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. వ్యాక్సినేషన్పై అనుమానాలకు, ప్రశ్నలకు 100 కోట్ల ఘనతే సరైన సమాధానమని పేర్కొన్నారు. దేశశక్తి సామర్థ్యాలేంటనేది వ్యాక్సినేషన్ ద్వారా ప్రపంచానికి మరోసారి తెలిసిందన్నారు. ఆర్థిక వ్యవస్థలో కొత్త ఆశావాదాన్ని కలుగజేసిందని, భారత కంపెనీల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయని చెప్పారు. ‘సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’కు భారత వ్యాక్సినేషన్ ప్రోగ్రాం చక్కని ఉదాహరణ అని చెప్పారు.