భోపాల్, నవంబర్ 15: దేశ సంస్కృతి, నిర్మాణంలో గిరిజనుల భాగస్వామ్యం ప్రశంసనీయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో సోమవారం జరిగిన ‘జన్జాతీయ గౌరవ్ దివస్ (ట్రైబల్ ప్రైడ్ డే)’ కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. గాంధీ, అంబేద్కర్ వంటి నేతల జయంతి మాదిరిగానే గిరిజనుల ఆరాధ్యుడు బిర్సాముండా జయంతిని కూడా ఇకపై ప్రతిఏటా నవంబర్ 15న ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునికీకరించిన రాణీ కమలాపతి రైల్వే స్టేషన్ను ఆయన జాతికి అంకితం చేశారు. ఇంతకుముందు హబిబ్గంజ్ పేరుతో ఈ రైల్వేస్టేషన్ పేరును రాణి కమలాపతిగా మార్చారు. కాంగ్రెస్ తన పాలనలో గిరిజనుల తీవ్ర నిర్లక్ష్యం చేసిందని మోదీ ఆరోపించారు.