హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ ఈనెల 30న సాయంత్రం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 27 నుంచి 30 వరకు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తెలంగాణలో ప్రధాని పర్యటించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. తిరిగి మే 2,3 తేదీల్లో ఏపీ పర్యటనకు వస్తారని, ఈ సందర్భంగా మరోసారి తెలంగాణలో పర్యటించే అవకాశం ఉన్నదని వెల్లడించాయి.