అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన సందర్భంగా నల్లబెలూన్లతో నిరసన తెలపడం కలకలం సృష్టిస్తోంది. గన్నవరం నుంచి భీమవరంకు హెలికాప్టర్లో బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే విమానాశ్రయానికి రెండుకిలోమీటర్ల దూరంలో ఉన్న కేసరపల్లి గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డజన్ల కొద్ది నల్లబెలూన్లు వదిలి నిరసన తెలిపారు.
అయితే రాష్ట్రంలో ప్రధాని పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్, ఎంఆర్పీఎస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. విమానాశ్రయానికి సమీపంలోనే ఇలాంటి ఘటన జరుగడం పట్ల రాష్ట్ర పోలీసులు సీరియస్గా తీసుకుని విచారణను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గన్నవరం విమానాశ్రయం నుంచి భీమవరానికి బయలుదేరిన సమయంలో కొందరు బెలూన్లను వదిలారు.