Sabitha Indra Reddy | బడంగ్పేట, ఏప్రిల్ 28 : సారు కేసీఆర్ను గుర్తుపెట్టుకొని.. కారు గుర్తుకు ఓటు వేసి చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వాకర్స్కు విజ్ఞప్తి చేశారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు కట్టపై ఆదివారం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మార్నింగ్ వాకర్స్ను ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేసేది బీఆర్ఎస్సేనని అన్నారు. హామీల అమల్లో కాంగ్రెస్ సర్కారు విఫలమైందన్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చే ఆ పార్టీ నేతలను నిలదీయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నీటి సమస్య, కరెంటు కష్టాలు మొదలయ్యాయన్నారు. పదేండ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి చేసిందేమీ లేదన్నారు. మతం పేరుతో, కులం పేరుతో ప్రజలను మోసం చేయడం తప్ప.. చేసింది శూన్యమన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మీర్పేట మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్ రెడ్డి, మీర్పేట బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేశ్ గౌడ్, కార్పొరేటర్లు అర్కల భూపాల్ రెడ్డి, ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మలక్పేట: సంక్షేమ పథకాల అమల్లో బీఆర్ఎస్ది ఒక చరిత్ర అని, దానిని ఎవరూ చెరిపేయలేరని హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం మూసారాంబాగ్లోని రజక సంఘ భవనంలో నిర్వహించిన మలక్పేట నియోజకవర్గ నాయకుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిసి కట్టుగా పనిచేస్తే హైదరాబాద్ ఎంపీ స్థానం బీఆర్ఎస్దేనన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చిన ఘనత కేసీఆర్ సర్కారుదేన్నారు. అన్నివర్గాల ప్రజలను అక్కున చేర్చుకొని…గొప్పగొప్ప సంక్షేమ పథకాలు అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ మలక్పేట నియోజకవర్గ ఇన్చార్జి తీగల అజిత్రెడ్డి, ఎన్నికల ఇన్చార్జి ఆజం అలీ తదితరులు పాల్గొన్నారు.
బన్సీలాల్పేట, ఏప్రిల్ 28 : ఆరు గ్యారెంటీలంటూ.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమల్లో విఫలమైందని, ఇంటింటికీ వెళ్లి.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దిశానిర్దేశం చేశారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ఆదివారం మారేడ్పల్లిలోని తన నివాసంలో సనత్నగర్ నియోజకవర్గం ముఖ్య నాయకులతో డివిజన్ల వారీగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సనత్నగర్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి వెంకట్రెడ్డిని పరిచయం చేశారు. అనంతరం తలసాని మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి పద్మారావు ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు నీరాజనం పడుతున్నారని, ఆయనకు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతున్నదన్నారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సనత్నగర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించాలని సూచించారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని, పద్మారావు గౌడ్ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉండి కూడా ప్రజలకు దూరంగా ఉన్న కిషన్రెడ్డికి ఓటమి తప్పదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ధరంరాజ్ చౌదరి, బి.కిరణ్కుమార్ గౌడ్, బాల్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కే. లక్ష్మీపతి, శ్రీహరి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.