మిర్యాలగూడ : భారతదేశంలో తొలి ఉపాధ్యాయురాలు, విద్యావేత్త, సావిత్రిబాయిపూలే జయంతిని మిర్యాలగూడలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, మాజీ MLA తిప్పన విజయసింహ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అట్టడుగు వర్గాలు, మహిళల విద్యాభివృద్ధికి చేసిన సేవలను ఆమె కొనియాడారు. పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని దారపోసిన మహనీయురాలని ప్రశంసించారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, రజక సంఘం పట్టణ అధ్యక్షుడు యర్రబెల్లి దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి కుమ్మరికుంట్ల సుధాకర్, నాయకులు బాసాని గిరి, మారం శ్రీనివాస్, తదితరులు పాల్గొనారు.