హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కవిత శనివారం అమెరికా చేరుకొన్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, టీఆర్ఎస్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు మహేశ్ బిగాల, టీఆర్ఎస్ అమెరికా విభాగం నాయకులు కవితకు ఘన స్వాగతం పలికారు.
వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3 వరకు జరుగుతున్న ఆటా మహాసభల్లో భాగంగా యూత్ కన్వెన్షన్లో తెలంగాణ పెవిలియన్ను ఆమె ప్రారంభించనున్నారు. బతుకమ్మపై ఆటా ప్రచురించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తారు. ఇప్పటికే అమెరికా చేరుకొన్న మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ తదితరులు ఆటా సభల్లో పాల్గొంటున్నారు.