హైదరాబాద్, ఆట ప్రతినిధి: దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలువడంలో కీలకంగా వ్యవహరించిన రాష్ర్టానికి చెందిన త్రిష, యశశ్రీ, షాలినిని ఎమ్మెల్సీ కవిత ప్రత్యేకంగా అభినందించారు. శనివారం హైదరాబాద్లోని తన నివాసంలో వరల్డ్కప్ విజేతలను ఆమె ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ‘ప్రపంచకప్లో త్రిష అద్భుత ప్రదర్శన కనబరిచింది. మీరు సాధించిన విజయం యువతకు స్ఫూర్తిదాయకం. భవిష్యత్లో మీరు మరిన్ని విజయాలు సాధించాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, హెచ్సీఏ ప్రతినిధులు, క్రికెటర్ల తల్లిదండ్రులు పాల్గొన్నారు.