తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 14: ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఎల్ రమణ, భానుప్రసాద్రావు విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు మంగళవారం సంబురాలు జరుపుకొన్నారు. మండలాధ్యక్షుడు రావుల రమేశ్ ఆధ్వర్యంలో ఎల్ఎండీ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు భానుప్రసాద్రావు, ఎల్ రమణను కౌంటింగ్ కేంద్రం వద్ద రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు. సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ్ణారావు, నారదాసు లక్ష్మణ్రావు, నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు.
చిగురుమామిడి, డిసెంబర్ 14: టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని ఎంపీపీ కొత్త వినీత, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్రెడ్డి, మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని అంబేదర్ చౌరస్తా వద్ద పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఇక్కడ వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడి, సర్పంచులు బెజ్జంకి లక్ష్మణ్, జకుల రవి, సల్ల వెంకటేశం, బోయిని శ్రీనివాస్, ఎంపీటీసీలు మిట్టపెల్లి మల్లేశం, మెడబోయిన తిరుపతి, నాయకులు మంకు శ్రీనివాస్రెడ్డి, కల్వల రాజేశ్వర్రెడ్డి, చెప్యాల శ్రీనివాస్, చెప్యాల నారాయణరెడ్డి, సర్వర్ పాషా, చిట్టిమల్ల శ్రీనివాస్, పీచు సత్యనారాయణరెడ్డి, గిట్ల తిరుపతిరెడ్డి, రాజమల్లు, తిరుపతి, వేణు, కల్వల సంపత్రెడ్డి, తిరుపతి, శ్రీనివాస్, సంపత్రెడ్డి పాల్గొన్నారు.