హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రత్యర్థులను అణచివేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం అల్లిన కుట్ర వీగిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. జాగృతి నేత కవిత, ఆప్ అధినేత కేజ్రీవాల్, మనీశ్సిసోడియా వంటి నాయకులపై మోపిన అక్రమ కేసులు కేవలం రాజకీయ కక్షతో కూడుకున్నవేనని, కోర్టు తీర్పు ద్వారా స్పష్టమైందని తెలిపారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులను ఇబ్బంది పెట్టాలని చూసిన శక్తులకు ఇది గొడ్డలిపెట్టని దుయ్యబట్టారు.