మహబూబ్నగర్టౌన్, ఫిబ్రవరి 22: మహబూబ్నగర్ మున్సిపల్ బడ్జెట్ను 2024-25 ను మున్సిపల్ చైర్మన్ ఆనంద్కుమార్గౌడ్ రూ.54.19 కోట్లతో ప్రవేశపెట్టారు. గురువా రం మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన బడ్జెట్ సమావేశానికి మహబూబ్నగర్ ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, అదనపు కలెక్టర్ శి వేంద్రప్రతాప్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యా రు. బడ్జెట్కు సభ్యులంతా ఆమోదం తెలిపా రు. 2023-24 సంవత్సరానికి మిగులు బడ్జె ట్ రూ.3కోట్ల 57లక్షలుగా చూపారు. మిగులు బడ్జెట్ కలుపుకొని రూ.57.76కోట్ల అంచనా తో బడ్జెట్ తయారు చేశారు. ఇందులో రూ. 28.40కోట్లు పన్నులలో వస్తాయని, పన్నేతర రాబడి రూ.25.78కోట్లుగా చూపారు.
మహబూబ్నగర్ పట్టణాభివృద్ధిపై దృష్టి సారించాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశంలో మాట్లాడుతూ అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి ప్రతిపాదనలు ఇప్పటికే పంపామన్నారు. వీలైనంత త్వరగా చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులను తీసుకొని కేంద్ర అర్బన్ డె వలప్మెంట్ మంత్రిని కలిసి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి సహకారంతో పట్టణాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పలువార్డుల్లో తాగునీరు, వీధికుక్క ల సమస్య, విద్యుద్ధీపాలు, వాటర్పైప్లైన్ స మస్యలను వివరించారు. సమావేశంలో ము న్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్అహ్మద్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.