వీణవంక: యాదవుల అభివృద్ది ముఖ్యమంత్రి కేసీఆర్తో సాధ్యపడుతుందని, దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయలేనటువంటి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు తెలిపారు. మండల పరిధిలోని బేతిగల్ గ్రామంలో సోమవారం యాదవ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిధిగా హజరై, మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 12వేల కోట్లు రూపాయలతో యాదవులకు గొర్రెలను అందించిందన్నారు. యాదవులకు గొర్రెల పంపిణీ పై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే టికెట్ యాదవు కులస్తులకు కేటాయించి రాజ్యాధికారంలో భాగం చేస్తున్నరని చెప్పారు.
బేతిగల్ యాదవు సంఘం కులస్తులు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లుశ్రీనివాస్ యాదవ్ కు ఓటు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తీర్మాన పత్రాన్ని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావుకు అందించారు. యాదవ కలస్తులను అయన అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోరె సారయ్య,ఉప సర్పంచ్ చొప్పరి తిరుపతి,టీఆర్ఎస్ గ్రామ కమిటిఅధ్యక్షుడు వేణుగోపాల్రావు,నాయకులు మాసాడి మాధవరావు పాల్గొన్నారు.