చిక్కడపల్లి ( హైదరాబాద్ ) : మత్స్యకారుల్లో జీవితాల్లో వెలుగు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ ( MLA Muthagopal) అన్నారు. తెలంగాణ గంగ తెప్పోత్సవ ఆధ్వర్యంలో ఈ నెల 20 న జరగబోయే గంగ తెప్పోత్సవం బోనాల పండుగకు సంబంధించిన వాల్ పోస్టర్ ( Poster), బ్యానర్లను గురువారం ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న బేస్తల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగానే గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రభుత్వం ఉచితంగా చేపలను అందిస్తుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR) అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూనే బేస్త వారికి అనేక సౌకర్యాలు కల్పించారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే చేపల వృత్తిని పెంచడం, ప్రొసెసింగ్, మార్కెటింగ్కు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ నీలి విప్లవాన్ని తీసుకొచ్చారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో యువజన విభాగంనాయకుడు ముఠాజయసింహ, గంగ తెప్పోత్సవం కమిటీ అధ్యక్షుడు మల్కు మహేందర్, సహాయ కార్యదర్శి గుండు జగదీశ్ బాబు, నాయకులు బి.రాజు, బాబురావు, సురేశ్, అనీష్, కొండల్, నర్సింగ్ ప్రసాద్, రామచందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.