సిద్దిపేట : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకొని, పట్నాలు వేసి మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందించి వారిని సత్కరించారు.