జయశంకర్ భూపాలపల్లి : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వంద శాతం పూర్తి చేశానని, మరోసారి భూపాలపల్లి నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో రూ.34 కోట్ల నిధులతో ఇండోర్ స్టేడియం నిర్మాణం, రోడ్డు వెడల్ప, పట్టణంలో ఆయా వార్డులో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గండ్ర
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..భూపాలపల్లి మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధిని చేసి చూపించామన్నారు. ఇలాగే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధుల, అధికారులు పాల్గొన్నారు.