వరంగల్ నిట్లో సీటు పొంది, టర్మ్ ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు దుర్గం రంజిత్, నందనకారి సాయితేజకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూతురు నిహారిక చేతులమీదుగా రూ.30 వేల ఆర్థిక సాయం అందజేశారు. మున్ముందు వారి చదువుల కోసం సహకారం అందజేస్తానని హామీ ఇచ్చారు. -బెల్లంపల్లి రూరల్