హాజరైన ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, సంగ్రాం మహరాజ్, సర్వేశ్వర మహరాజ్
పెద్దశంకరంపేట,డిసెంబర్ 25: పెద్దశంకరంపేట పట్టణంలోని పాత గ్రామపంచాయతీ ఆవరణలో టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు, అయ్యప్ప సేవా సమితి బాధ్యులు ఆసూరి మురళిపంతులు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అయ్యప్ప పడిపూజ వైభవంగా నిర్వహించారు. గురుస్వాములు రామచంద్రాచారి, వేణుగోపాల చారి స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, పూజలు చేశారు. అనంతరం 18 మెట్ల పడిని స్వాములు వెలిగించారు.
ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే , పీఠాధిపతులు
పెద్దశంకరంపేటలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ,కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహరాజ్, దుద్యాల ఆశ్రమ పీఠాధిపతి సర్వేశ్వర మహరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు చేయటం అభినందనీయమని ఎమ్మెల్యే అన్నారు.ధర్మ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి అని సంగ్రాం మహరాజ్ అన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ జంగం శ్రీనివాస్, సర్పంచ్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేశ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు సురేశ్గౌడ్, తహసీల్దార్ చరణ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రాములు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దత్తు, మాజీ ఎంపీపీ రాజు, ఎంపీటీసీ వీణా సుభాష్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్వాము లు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
ఆలయానికి రూ. 2 లక్షల విరాళం
మనోహరాబాద్, డిసెంబర్ 25 : దేవాలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జిల్లా ఆర్థిక ప్రణాళికా సభ్యుడు, జడ్పీటీసీ మహేశ్ అన్నారు. శివ్వంపేట మండలం సికింద్లాపూర్లో నిర్మించిన దుర్గాదేవి, గ్రామ దేవతల ఆలయంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తుల కోసం రూ. 2 లక్షల విరాళాన్ని అందజేయగా గ్రా మ యువకులు,సర్పంచ్ సుధాకర్రెడ్డి జడ్పీటీసీని సన్మానించారు
దేవాలయంలో హోమం
మెదక్ అర్బన్, డిసెంబర్ 25: జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయంలో మండల పూజ పురస్కరించుకొని గణపతి హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నా రు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి వైద్య రాజు పంతులు, ఆలయ పూజారి శంకర్, వేదపండితులు వైద్యశ్రీనివాస్, అం కుర్శర్మ, మణికంఠ, ఈశ్వర రమణ, అయ్యప్ప స్వాములు,భక్తులు పాల్గొన్నారు.
జలహనుమాన్ ఆలయంలో
నర్సాపూర్,డిసెంబర్ 25: మండల పరిధిలోని పెద్దచింతకుంట సమీపంలో జలహనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దర్శించుకున్నారు. ఆలయంలో అభిషేకం,అర్చన, చందనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మ న్ సుధాకర్చారి, పూజారి, భక్తులు పాల్గొన్నారు.
రామాయంపేట…
రామాయంపేట, డిసెంబర్ 25: పట్టణంలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.ఆలయ కమిటీ చైర్మన్ బచ్చు నాగలక్ష్మి-భూమయ్య అభిషేకాలు, నైవేద్యా లను సమర్పించారు.
చేగుంట…
చేగుంట,డిసెంబర్ 25: చేగుంటలో భక్తి శ్రద్ధలతో అయ్యప్పస్వామికి పూజలు ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
కాలభైరవ స్వామి ఆలయంలో
మెదక్ రూరల్ ,డిసెంబర్ 25:మండల పరిధిలోని ఖాజిపల్లిలోని కాలభైరవ స్వామి ఆలయంలో ఆలయ దేవ స్థాన ట్రస్టు వ్యవస్థాపకుడు, చైర్మన్ రాజశేఖర్ ఆధ్వరంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.