శాసనమండలి చైర్మన్ గుత్తా, ఎమ్మెల్యే చిరుమర్తి
చిట్యాల, జూన్ 9 : ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం మండలంలోని నేరడ గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి ఉత్సవాల్లో వారు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు గుత్తా, చిరుమర్తిని శాలువాలతో సత్కరించారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, ఎంపీపీ కొలను సునీతావెంకటేశ్, వైస్ ఎంపీపీ మర్ల అలివేలూరాంరెడ్డి పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బొడ్రాయి పండుగలో పాల్గొని పూజలు చేశారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాటం వెంకటేశం ఉన్నారు.