హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): అటవీశాఖలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో గ్యాలంటరీ అవార్డులు అందజేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కోరింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు బుధవారం లేఖలు రాసింది. అటవీశాఖలో విధి నిర్వహణలో పలువురు ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ప్రాణాలను కోల్పోతున్నారని, ఈ మేరకు వారి పేరుతో ఏదైనా అవార్డులు ఇవ్వాలని తెలంగాణ అటవీశాఖలో పనిచేస్తున్న డిప్యూటీ కన్జర్వేటర్ డీవీ రెడ్డి కేంద్రానికి ఈ నెల 1న లేఖ రాశారు.