సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని సంతోషిమాత ఆలయంలో రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సహకారంతో ఆలయ పాలకమండలి బంగారు కిరీటాన్ని తయారు చేయించగా.. ఆదివారం మంత్రి చేతుల మీదుగా అమ్మవారికి అలంకరించారు. అలాగే రక్షాబంధన్ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన బంగారు రాఖీని సైతం సమర్పించారు. తన జన్మదిన సందర్భంగా ఆలయంలో మంత్రి ప్రత్యేకలు నిర్వహించారు. అనంతరం పట్టణానికి చెందిన పలువురు మహిళలు ఆయనకు రాఖీలు కట్టారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికారావు, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పుల లలితా, మంత్రి సోదరి కడారి సరళ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సల్మా మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.