హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటోందని, ఇప్పటికే సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల అమలులో యావత్ దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలుస్తోందని అన్నారు. దినదినాభివృద్ధి సాధిస్తూ, దేశంలో అగ్రగామిగా వెలుగొందుతున్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత శుభకృత్ నామ సంవత్సరంలో మరింత ప్రగతి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలు, ఆనందోత్సాహాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.