హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. వర్క్చార్ట్ ప్రకా రం పనులు జరగాలని, పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు, ఆరిటెక్ట్లతో సమావేశమయ్యారు. నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. అంతస్తులవారీగా అంతర్గత నిర్మాణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా జరగాలని సూచించారు. అంతర్గత గదుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, పనులన్నీ సమాంతరంగా జరగాలని స్పష్టంచేశారు. దేవాలయం, మసీదు, చర్చి నిర్మాణాలు జరిగే స్థలాలను, వాటి ప్లాన్లను పరిశీలించారు. ప్రార్థనా మందిరాల నిర్మణాలు కూడా త్వరగా ప్రారభించాలని అధికారులను, ఏజెన్సీని మంత్రి ఆదేశించారు. సచివాలయ నిర్మాణంలో మొత్తం 8 స్లాబ్లకుగాను ముందు వైపు 6, వెనకవైపు 7 స్లాబ్లు పూర్తి అయ్యాయని మంత్రికి అధికారులు వివరించారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈలు లింగారెడ్డి, సత్యనారాయణ, ఈఈలు శశిధర్, శ్రీనివాస్, వాస్తు నిపుణులు సుధాకర్తేజ, ఆరిటెక్ట్ ఆసార్ పొన్ని పాల్గొన్నారు.