హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): సచివాలయం, అమరవీరుల స్మారక చిహ్నం నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని, వర్క్చార్ట్ ప్రకారం గడువులోగా నిర్మాణాలు పూర్తవ్వాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిపై సోమవారం రోడ్లు, భవనాల శాఖ కార్యాలయం లో అధికారులు, వర్ ఏజన్సీ, కన్సల్టెన్సీ, ఆరిటెక్ట్ ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరవీరుల స్మారక చిహ్నం మీద నిరంతరం జ్వలించే జ్వాల అమరుల త్యాగాన్ని ప్రతిబింబించేలా ఉండాలని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అంతస్తుల వారీగా డిజైన్లు, ప్లాన్లను పరిశీలించారు. స్మారక చిహ్నం బిల్డింగ్లో ప్రవేశించే ముందు చిన్నారులతో అమరులకు నివాళి అర్పిస్తున్నట్టుగా ఉన్న డిజైన్, ల్యాండ్ సేప్, ఆడియో-వీడియో విజువల్ రూమ్ కన్సల్టెన్సీ రూపొందించిన ప్లాన్ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూశారు. ముఖద్వారం వద్ద ‘తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం’ అని తెలుగులో ఉండాలని, ఆడియో-విజువల్ రూమ్లో సీటింగ్ వరుసల మధ్య కింది నుంచి మీదికు ఆరు ఇంచుల ఎత్తు ఉండేలా చూడాలని మంత్రి సూచించారు. అమరుల త్యాగాలను కండ్లకు కట్టినట్టు చూపించే ఫొటో ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్ హాల్, రెస్టారెంట్ ప్లాన్లను పరిశీలించి, స్వల్ప మార్పులు సూచించారు.
వర్క్చార్ట్ ప్రకారం పనులు
సెక్రటేరియట్ నిర్మాణ పనులపట్ల మంత్రి వేముల సంతృప్తి వ్యక్తం చేస్తూ, పనుల్లో వేగం పెంచాలని సూచించారు. మినిస్టర్ చాంబర్స్, ఆఫీసర్ చాంబర్స్, శాఖలవారీగా సెక్షన్ల చాంబర్స్తో పాటు వివిధ అంతర్గత నిర్మాణాలపై చర్చించారు. సీఎం కేసీఆర్ సూచించిన మార్పుల ఫైనల్ ప్లాన్లను వీలైనంత త్వరలో సమర్పించాలని ఆదేశించారు. అటు.. బ్లాక్ల వారీగా స్లాబ్ నిర్మాణాలు, వర్చార్ట్ ప్రకారం జరిగే పనులను అధికారులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఈఎన్సీ గణపతిరెడ్డి, ఎస్ఈలు పద్మనాభరావు, లింగారెడ్డి, సత్యనారాయణ, ఈఈలు శశిధర్, నర్సింగ్రావు, వాస్తు నిపుణుడు సుధాకర్తేజ, ఆరిటెక్ట్ ఆసార్ పొన్ని, పలువురు కన్సల్టెన్సీ, వర్ ఏజన్సీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.