బన్సీలాల్పేట్, నవంబర్ 29 : లబ్ధిదారుల సమక్షంలోనే అర్హులను ఎంపిక చేస్తూ, డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మాసాబ్ట్యాంక్లోని తన కార్యాలయ సెమినార్ హాల్లో జీహెచ్ఎంసీ, రెవెన్యూ, జలమండలి, హౌసింగ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ శర్మన్, సికింద్రాబాద్ ఆర్డీవో వసంతకుమారి, బన్సీలాల్పేట్ కార్పొరేటర్ హేమలత, జీహెచ్ఎంసీ నార్త్ జోన్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ సీఈ కిషన్, ఈఈ వెంకట్దాస్రెడ్డి, జలమండలి ప్రాజెక్ట్స్ డైరెక్టర్ కృష్ణ, సికింద్రాబాద్, ముషీరాబాద్, అమీర్పేట్, ఖైరతాబాద్ మండలాల తహసీల్దార్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదలు గొప్పగా జీవించాలనే సీఎం కేసీఆర్ సంకల్పంతో సకల సదుపాయాలతో రెండు పడక గదుల ఇండ్లను నిర్మించి ఇస్తున్నారన్నారు.
సనత్నగర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రజల సమక్షంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించామన్నారు. బన్సీలాల్పేట్ డివిజన్లోని చాచానెహ్రూనగర్, బండమైసమ్మ నగర్ బస్తీలలో ఇండ్ల నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయని, వచ్చే నెలలో వాటిని అందజేయాలని నిర్ణయించామని తెలిపారు. తాగునీరు, డ్రైనేజీ పైప్లైన్, విద్యుత్ లైన్లు, వీధి దీపాలు, రోడ్లు లాంటి పనులను వేగవంతంగా చేసి, సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు మంత్రి ఆదేశించారు. ఇండ్ల ప్రారంభోత్సవానికి ముందే స్థానిక బస్తీవాసుల ముందు అర్హులను గుర్తించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు.
అమీర్పేట్, నవంబర్ 29 : ఎస్ఆర్నగర్ వయోధికుల మండలిని సందర్శించాల్సిందిగా కోరుతూ మండలి ప్రతినిధులు సోమవారం ఉదయం మంత్రి తలసానిని ఆయన నివాసంలో కలుసుకుని కోరారు. మండలి అధ్యక్షుడు కాసాని సహదేవ్గౌడ్ ఆధ్వర్యంలో మండలి ప్రతినిధులు లింగమయ్య, బిచ్చప్ప, ముత్తారెడ్డి, బాల్రాజ్యాదవ్, అరవింద్గౌడ్ తదితరులు మంత్రిని కలిశారు. వచ్చేనెల 5న కౌన్సిల్ కార్యాలయాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.