Minister Srinivas Yadav | తెలంగాణ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంతో పేదల సొంతింటి ఇంటి కల సాకారం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రతిపక్షాల నాయకులకు అవేవీ కనిపించడం లేదని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. అన్నిమతాలను తెలంగాణ ప్రభుత్వం సమానంగా గౌరవిస్తుందని, కొన్ని పార్టీలు మతాలతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు.