ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్టౌన్, ఫిబ్రవరి 9 : అన్నివర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మున్సిపాలిటీలోని 16వ వార్డు బోయపల్లిలో బుధవారం మైనార్టీ కమ్యూనిటీహాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీల సంక్షేమానికి పెద్దపీఠ వేసి పథకాలను అమ లు చేస్తున్నట్లు తెలిపారు. మైనార్టీ విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు గురుకులాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. రూ.14లక్షలతో కమ్యూనిటీహాల్ను అన్ని హంగులతో నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, కౌన్సిలర్ మోతీలాల్, వెంకట్రాములు, ఆంజనేయులు, హఫిజ్, అఖి ల్, ఇంతియాజ్, రహీం, శరత్చంద్ర, నాగిరెడ్డి, యాదయ్య, కుమార్, వినోద్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
సర్వేయర్లకు లైసెన్స్లు పంపిణీ
మహబూబ్నగర్ మున్సిపల్ సర్వేయర్లు, ఇంజినీర్లకు మంత్రి శ్రీనివాస్గౌడ్ లైసెన్స్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన చట్టం ప్రకా రం ఇంటి నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో టీపీవో ప్రతాప్కుమార్, శ్రీనివాసులు, అన్వర్, శ్రవణ్కుమార్, నరేశ్, చంద్రయ్య, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
పనులను పూర్తి చేయాలి
మహబూబ్నగర్, ఫిబ్రవరి 9 : మహబూబ్నగర్లో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులకు సూచించారు. బుధవారం హైదరాబాద్లో సంబంధిత అధికారులతో స మావేశమయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్లో చేపట్టిన ట్యాంక్బండ్ సుం దరీకరణ, శిల్పారామం ఏర్పాటు, ప్రధాన జంక్షన్ల విస్తరణ పనులపై టూరిజం ఎండీ మనోహర్కు దిశానిర్ధేశం చేశారు. హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉన్న మహబూబ్నగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు. సమావేశంలో ఈడీ శంకర్రెడ్డి, రాజేశ్, సుజాత, మనోహర్ ఉన్నారు.