హైదరాబాద్, జనవరి 24: కొమురవెల్లి మల్లన్న పూజా విధానంలో గత ఆచారాలు, సంప్రదాయాలనే కచ్చితంగా పాటించాలని సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఒగ్గు పూజారులకు ప్రాధాన్యత ఇవ్వాలని, పట్నాలు, కల్యాణం వంటివి ఒగ్గు సంప్రదాయంలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో సాంస్కృతిక దాడి అంటూ పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ సోమవారం రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఒగ్గు పూజారులు, దేవాదాయ, సాంస్కృతిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఒగ్గు పూజారుల ప్రతినిధులు, గొల్ల కురుమలు చేసిన అభ్యర్థన మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గొల్ల కురుమ, ఒగ్గు పూజరుల ప్రతినిధులు వ్యక్తంచేసిన అభ్యంతరాలపై అధ్యయనానికి దేవాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ సారథ్యంలో కమిటీని నియమించి, సమస్యలను పరిషరిస్తామని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ తెలిపారు. ఇటీవల ఉత్సవాల్లో కొన్ని పొరపాట్లు తెలియకుండా జరిగాయని మంత్రికి కొమురవెల్లి మల్లన్న దేవాలయం ఈవో వివరణ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, సాంసృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.