మహబూబ్నగర్, నవంబర్ 28: అందరికీ విద్య అందాలన్నదే జ్యోతిరావుపూలే ఆశయమని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్లోని పద్మావతి కాలనీలో పూలే విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు సమాంతర న్యాయం జరగాలంటే రిజర్వేషన్ల్లతోనే సాధ్యమని మొదటిసారి చెప్పిన గొప్ప వ్యక్తి పూలే అని మంత్రి కొనియాడారు.
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): కులవ్యవస్థ నిర్మూలన, మహిళోద్ధరణ, సమన్యాయ సాధనకు జీవితాంతం కృషిచేసిన సామాజిక పరివర్తకుడు మహాత్మా జ్యోతిరావుపూలే అని బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కొనియాడారు. ఆదివారం అంబర్పేట లోని పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పూలే ఆశించిన సామాజిక న్యాయంకోసం ప్రజలంతా పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. అంబర్పేటలోని పూలే విగ్రహం వద్ద నివాళులర్పించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో దేశంలో బడుగు బలహీన వర్గాలకు సామాజికన్యాయం జరగడం లేదన్నారు.