మహబూబాబాద్ : వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో పలు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి . రాత్రి కురిసిన భారీ వర్షానికి పాలేరు వాగు పొంగిపొర్లుతుంది. దీంతో దంతాల పల్లి మండలం పెద్ద ముప్పారం వద్ద లోయర్ బ్రిడ్జి నుంచి నీరు ప్రవహిస్తుండడంతో ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
జిల్లాలోని మరిపెడ మండలం పురోషోత్తా మాయగూడెం శివారులోని ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మంగళవారం రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్య వతి రాథోడ్ (Minister Satyavati Rathod ) వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరివాహక ప్రాంత రైతులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు ప్రవాహ ఉధృతిని తమకు నివేదించాలని ఆదేశించారు. జిల్లాలోని వట్టి వాగు బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో కేసముద్రం – గూడూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది .