మహేశ్వరం : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రానుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita reddy) అన్నారు. శుక్రవారం మహేశ్వరంలో నామినేషన్ వేసిన అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. నియోజక వర్గంలోని ప్రజలు సీఎం కేసీఆర్కు అండగా ఉండి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాతనే నియోజక వర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. రాబోయె ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టి ఆశీర్వదించాలని కోరారు. మహేశ్వరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, ప్రజాసేవకులకు జరుగుతున్న ఓట్ల యుద్ధంలో నియోజక వర్గం ప్రజలే న్యాయ నిర్ణేతలని ఆమె చెప్పారు. బీఆర్ఎస్ బలగంతో సీఎం కేసీఆర్(CM KCR) కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. కరెంటు కష్టాలతో కర్ణాటకలో రైతులు సబ్స్టేషన్లో మొసళ్లను ఉంచారని గుర్తు చేశారు. అక్కడి తరహా పాలన తెలంగాణలో అవసరం లేదని అన్నారు.
ప్రతి పక్ష పార్టీల నాయకుల మాటలను నమ్మి మరోసారి మోసపోవద్దని సూచించారు. పేదల కష్ట సుఖాలను గమనించిన సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పించన్లను అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో పేదలకు రూ. 4 వందలకే గ్యాస్ సిలిండర్ను అందించనున్నామని తెలిపారు. ప్రతి మహిళకు నెలకు రూ. 3 వేలను ఇవ్వనున్నామని ఆమె వెల్లడించారు.
తెలంగాణలో సాగు చేస్తున్న రైతాంగానికి రూ. 16 వేలను ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు కార్తిక్రెడ్డి, కౌశిక్రెడ్డి, ఇన్చార్జి ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్, మీర్పేట్ మేయర్ దుర్గా దీఫ్లాల్ చౌహాన్, నాయకులు క పాల్గొన్నారు.