మహబూబ్నగర్: రాష్ట్ర యువజన, ఎక్సైజ్ శాఖమంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను మహబూబ్నగర్లో శుక్రవారం మంత్రి మల్లారెడ్డి, చేవెళ్ల లోక్సభ సభ్యుడు డాక్టర్ జీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, కేపీ వివేకానంద పరామర్శించారు. శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రిని పరామర్శించి, శాంతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.