ఘట్కేసర్ రూరల్, నవంబర్ 14: నియోజకవర్గంలో పేద కుటుంబాలను మంత్రి చామకూర మల్లారెడ్డి ఆదుకుంటున్నారని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగులపల్లి రమేశ్ తెలిపారు. ఆదివారం అంకుషాపూర్లో అనారోగ్యంతో మృతి చెందిన గుల్లం మల్లమ్మ కుటుంబీకులకు మంత్రి రూ.5 వేల ఆర్థిక సాయాన్ని మండల ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి ప్రవీణ్రెడ్డితో కలిసి అందజేశారు. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, ప్రచార కార్యదర్శి రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు గోపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేశ్, వార్డు సభ్యుడు బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.