మహబూబ్నగర్ : జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ జడ్చర్ల మండలం కొడ్గల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదికను శుక్రవారం ప్రారంభించారు. రైతు వేదికల నిర్మాణంతో అన్నదాతల సమస్యలు పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
కార్యక్రమంలో మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాగా, తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలోని MJR ట్రస్ట్ నిర్మించిన జెడ్పీ హై స్కూల్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.