బీజేపీ డీఎన్ఏలోనే అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు ఉన్నాయి. ఎప్పటిలాగే కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అలవోకగా అబద్ధాలు వల్లె వేశారు.
రాజకీయంగా బీజేపీతో విభేదిస్తున్నామన్న ఒకే ఒక కారణంతో మోదీ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసింది.
తెలంగాణకు మోదీ సర్కారు శనిలా దాపురించింది. మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఐటీఐఆర్ వంటి ఎన్నో ప్రాజెక్టులు రద్దుచేసింది.
రాజకీయంగా తమకు ప్రయోజనం కాదన్న కారణంతోనే ఐటీఐఆర్ను కేంద్రం రద్దుచేసింది. కేంద్రం విధానపర అశక్తతను పార్లమెంట్లో ఒప్పుకొని, తెలంగాణ ఐటీ గ్రాడ్యుయేట్లు, వృత్తి నిపుణులు, యువతకు క్షమాపణ చెప్పాలి.
-మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు కేటాయించిన ఐటీఐఆర్ ప్రాజెక్టును సంకుచిత రాజకీయాల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులు మంజూరు చేశామని పార్లమెంట్లో కేంద్రం నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని తాజాగా పార్లమెంట్లో కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ డీఎన్ఏలోనే అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు ఉన్నాయని.. ఎప్పటిలాగే కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అలవోకగా అబద్ధాలు వల్లె వేశారని శుక్రవారం ఆయన విమర్శించారు. రాజకీయంగా బీజేపీతో విభేదిస్తున్నామన్న ఒకే ఒక కారణంతో మోదీ ప్రభుత్వం ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు.
కేంద్రం చర్యతో హైదరాబాద్ ఐటీ పరిశ్రమ మరింత ఎదిగే అవకాశాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ సాధిస్తున్న ప్రగతికి కేంద్రం చేసిన సాయం ఏమీ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణకు మోదీ సర్కారు శని లా దాపురించిందని మండిపడ్డారు. హైదరాబాద్లో ఐటీఐఆర్ ఏర్పాటుకు 2013లో అప్పటి కేంద్ర ప్రభు త్వం ఆమోదం తెలిపినా, ఆ తర్వాత మోదీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ఐటీఐఆర్ వంటి ఎన్నో ప్రాజెక్టులు రద్దుచేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్తోపాటు తాను కూడా అనేకసార్లు ప్రధానితోపాటు కేంద్ర మంత్రులను కలిసి ఐటీఐఆర్ ఇవ్వాలని అడిగినా తోలు మందం కేంద్రంలో చలనం రాలేదని మండిపడ్డారు. హైదరాబాద్ ఐటీ ఎకోసిస్టంకు కేంద్రం నయా పైసా సాయం చేయలేదని విమర్శించారు. మోదీ అసంబద్ధ నిర్ణయాలైన నోట్లరద్దు, కరోనా లాక్డౌన్తో ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభంలోనూ తెలంగాణ ఐటీ పరిశ్రమ అద్భుత ప్రగతి సాధించిందని, ఐటీఐఆర్ ప్రాజెక్టు కూడా ఉండి ఉంటే హైదరాబాద్ ఐటీ ఎకోసిస్టం ఆకాశమే హద్దుగా ఎదిగేదని అన్నారు.
రాజకీయంగా ప్రయోజనం కాదనే..
హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టుకు చేస్తున్న ధోకాను కప్పిపుచ్చుకొనేందుకు బీజేపీ గల్లీ లీడర్లు పూటకో మాట మాట్లాడి పబ్బం గడుపుకొన్నారని కేటీఆర్ విమర్శించారు. రాజకీయంగా తమకు ప్రయోజనం కాదన్న కారణంతోనే ఐటీఐఆర్ను కేంద్రం రద్దుచేసిందని ఆరోపించారు. ఆధునిక భారత్ను నిర్మించడంపై కేంద్రం విధానపర అశక్తతను పార్లమెంట్లో ఒప్పుకొని తెలంగాణ ఐటీ గ్రాడ్యుయేట్లు, వృత్తి నిపుణులు, యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్లను తెలంగాణకు మంజూరు చేసినందుకే ఐటీఐఆర్ను రద్దు చేశామని కేంద్రం చెప్పడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. ఐటీ పరిశ్రమ బలోపేతం కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన పథకాన్ని ఇతర రంగాల్లోని కార్యక్రమాలకు బదులుగా రద్దుచేయటం బీజేపీ ప్రభుత్వం విధానపరమైన నిబద్ధ్దతకు నిదర్శనమని ఎద్దేశా చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్కు లెకలేనన్ని కేంద్ర పథకాలను మంజూరు చేసుకొంటూ.. తెలంగాణకు వస్తున్న చారాణా, ఆఠాణా మందం పనులను కూడా సాకుగా చూపెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐటీఐఆర్కు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ ఐటీ పరిశ్రమకు మోదీ ప్రభుత్వం ఇచ్చిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
సాఫ్ట్వేర్ పార్కుల్లోనూ అన్యాయమే
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ఇకడి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నా ప్రధాని మోదీలో చలనం రావడం లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పురోగమిస్తున్న తెలంగాణ ఐటీ రంగ ప్రగతిని అడ్డుకొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న మోదీ ప్రభుత్వ నికృష్ట రాజకీయానికి ఈమధ్యనే ప్రకటించిన సాఫ్ట్వేర్ పార్కులే నిదర్శనమని అన్నారు. దేశవ్యాప్తంగా 22 సాప్ట్వేర్ పారులు ప్రకటించి.. తెలంగాణకు మెండిచెయ్యి చూపడం బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న చిన్నచూపునకు నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికైనా దేశ ఐటీ రంగానికి దిక్సూచిగా ఎదుగుతున్న తెలంగాణ ఐటీ రంగానికి కేంద్రం ఐటీఐఅర్కు సమానంగా ఒక ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఐటీఐఆర్ రద్దు దారుణం: మంత్రి అల్లోల
ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం రద్దు చేయడం దారుణమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపా రు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవడమే మోదీ సర్కారు విధానంగా మారిందని మండిపడ్డారు. ఐటీఐఆర్ రద్దుతో తెలంగాణ యువత ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని ఆగ్రహించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిం చటమే పనిగా పెట్టుకొన్న రాష్ట్ర బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారని నిలదీశారు. ఇప్పటికై నా యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్చేశారు.
ముందుచూపులేకే బొగ్గు కొరత
కేంద్ర విధానాలపై కేటీఆర్ ఫైర్
దేశంలో వందేండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ, ప్రస్తుత కొరతకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేంద్ర ప్రభుత్వ ప్రణాళికా లోపం, ముందుచూపు లేకపోవడం వల్లనే దేశీయంగా బొగ్గు కొరత ఏర్పడింది. దీనితో పది రెట్లు ఎక్కువ వెచ్చించి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. బొగ్గు దిగుమతుల వల్ల దేశీయంగా విద్యుత్తు టారిఫ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇందుకు ఎవరికి కృతజ్ఞతలు చెప్పాలో మీకు తెలుసు. ఇదే సమయంలో దేశంలో మరో వందేండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.