దళితులను గొప్పవాళ్లను చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొస్తే, దాన్ని ఆపే కుట్ర జరుగుతున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధును ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితబంధు ఆపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పిన కొప్పుల.. పేదల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రోద్భలంతోనే ఈసీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు అనిపిస్తోందని అన్నారు.
బీజేపీ దళిత వ్యతిరేక వైఖరిని బయటపెట్టుకున్నదని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. బీజేపీది చిల్లర వ్యవహారం అని ఫైర్ అయ్యారు. దళితబంధు పథకాన్ని చూసి బీజేపీ నేతల కండ్లు మండుతున్నాయని సుమన్ వ్యాఖ్యానించారు.