నల్లగొండ, మార్చి 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ను విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి గురువారం పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొన్నారు. మెరుగైన వై ద్యం అందేలా చూడాలని వారికి సూచించారు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు, సీపీఎం నేతల తో మాట్లాడుతూ.. మల్లు స్వరాజ్యం త్వరగా కోలుకొని ఇంటికి చేరుకొంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంత్రి వెంట భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఉన్నత విద్యామండలి సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి ఉన్నారు. కాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కూడా ఆమెను పరామర్శించారు.