సూర్యాపేట : జిల్లా కేంద్రంలో కబడ్డీ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కూలి ప్రేక్షకులు గాయపడిన ఘటనపై మంత్రి జగదీశ్ రెడ్డి విచారం వ్యక్తంచేశారు. సూర్యాపేట ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తున్నామని తెలిపారు. గాయపడిన వారికి అన్నివిధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షించాలని వైద్యులకు సూచించారు.