నిర్మల్ : జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.50 లక్షలతో నిర్మించనున్న సాలహారం, గ్రానైట్ నిర్మాణ పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేవరకోట దేవాలయం చాలా పురాతనమైన ఆలయమన్నారు. కాగా, కల్యాణ మండపానికి రూ.20 లక్షలు, రూ.50 లక్షలు షెడ్డు, కాలక్షేప మండపం, దుకాణలకు, ఇప్పటి వరకు ఆలయానికి కోటీ 20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
నిర్మల్ పట్టణంలోనే 162 ఆలయాలను 32 కోట్ల 13 లక్షలతో పూర్తిగా దేవాదాయ శాఖ నిధులతో నిర్మించినట్లు చెప్పారు. 80% వరకు ఆలయాల నిర్మాణాలు పూర్తి అయ్యాయని వివరించారు. అడెల్లి ఆలయాన్ని రూ.15 కోట్లతో కృష్ణ శిలలతో నిర్మిస్తున్నామని, ఈ విజయదశమి కి ఆలయ ప్రారంభంకానుందని తెలిపారు. అంతకుముందు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారిని మంత్రి దర్శించుకుని పూజలు చేశారు.