హైదరాబాద్ : తెలంగాణలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్(KTR)కు సంబంధించిన వెబ్సైట్ను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. కవ్వాల్ పులుల అభయారణ్యంపై అన్ని వివరాలతో www.kawaltiger.com అనే వెబ్సైట్ను పొందుపరిచారు. ఈ వెబ్సైట్లో పర్యాటకులు, సందర్శకులకు పూర్తిగా ఉపయోగపడే సమాచారం ఉంటుంది.
అదే విధంగా కవ్వాల్ అటవీ ప్రాంతంలో అభివృద్ధి చేసిన గడ్డి మైదానాలపై ప్రత్యేక బులెటిన్ను కూడా మంత్రి విడుదల చేశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ATR) వార్షిక పరిపాలన నివేదికను మంత్రి చేతుల మీదుగా అధికారులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, అమ్రాబాద్, కవాల్ టైగర్ రిజర్వు ఫీల్డ్ డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.