నిజామాబాద్, ఫిబ్రవరి 3: జిల్లాలోని జక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామంలో నిర్మించిన శ్రీ వెంవేంకటేశ్వర స్వామి వారి నూతన దేవాలయాన్ని గురువారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్తో కలిసి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆలయాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి, చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుందన్నారు.
రూ. కోటి నిధులు వ్యయం చేసి శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించారని, దేవాదాయ శాఖ రూ. 50 లక్షలు మంజూరు చేయగా, గ్రామస్తులు మరో 50 లక్షలు రూపాయాలు కంట్రీబ్యూట్ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.