జమ్మికుంట : జమ్మికుంట టీస్టాల్లో అమాత్యుడు హరీశ్రావు సందడి చేశారు. సోమవారం సాయంత్రం ఇల్లందకుంట మండలంలో ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకుని తిరుగుప్రయాణంలో జమ్మికుంటకు వచ్చారు. పట్టణంలోని చందన హోటల్ వద్ద ఆగారు. దీంతో అక్కడ చాయ్ తాగుతున్న జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు. మంత్రి అయి ఉండి కూడా ఎలాంటి హంగుఆర్భాటం లేకుండా సాధారణ టీస్టాల్లో టీతాగడానికి రావడమేంటని చర్చించుకున్నారు.
హోటల్ యజమానితో మాట్లాడి అక్కడికి వచ్చిన అందరికీ చాయ్ తాగించారు. ఎన్నికలపై చర్చపెట్టారు. ఆప్యాయంగా పలకరించారు. ఆయన పలకరింపులకు అక్కడున్న వారందరూ ఫిదా అయ్యారు. హోటల్ యజమాని మొగిలి కూడా మంత్రి హరీశ్రావు ఆకస్మికంగా దర్శనమివ్వడం చూసి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు.
‘‘ఒక నాలుగు రోజుల్లో మా టీ షాప్కి వస్తారు అనుకున్న సర్. రావాలని.. మిమ్మల్ని పిలవాలని చాలా ఉండే సర్. మేము మీ అభిమానులం సర్’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దీంతో హోటల్ యజమానిని ‘‘బాయ్.. చాయ్ సూపర్’’ అంటూ మంత్రి హరీశ్ కితాబిచ్చారు. అక్కడున్నవారితో సెల్ఫీలు దిగారు.