హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ)/ సుల్తాన్ బజార్: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావును బుధవారం ఆ శాఖ ఉన్నతాధికారులు కలిసి పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసినవారిలో ఆ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, వైద్య విద్యాశాఖ డైరెక్టర్ రమేశ్రెడ్డి, ఓఎస్డీ గంగాధర్, కాళోజీ నారాయణరావు హెల్త్ వర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సెంట్రల్ లీగల్ అధ్యక్షుడు పల్లం ప్రవీణ్, డీహెచ్ విభాగం అధ్యక్షుడు లాలూప్రసాద్ రాథోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కల్యాణ చక్రవర్తి, గాంధీ మెడికల్ కళాశాల సెక్రటరీ అజ్మీరా రంగా, ఉస్మానియా యూనిట్ ప్రతినిధి శేఖర్, వినోద్, రవి తదితరులు ఉన్నారు.