నారాయణఖేడ్ : సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు, స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రక్తదానం చేశారు.
అనంతరం ఆశ వర్కర్లకు మంత్రి చేతుల మీదుగా స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. కాగా, సీఎం కేసీఆర్ జన్మదినది వేడుకలను మూడు రోజుల పాటు(15,16,17,) ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
అందులో భాగంగా రెండో రోజు రాష్ట్ర మంతటా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని కేకులు కట్ చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేసి అన్నదాన, రక్తదాన కార్యక్రమాలు చేపట్టారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, జిల్లా వైద్య అధికారి గాయత్రీదేవి పాల్గొన్నారు.