సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రణాళికా బద్ధంగా ప్రిపేర్ కావాలన్నారు. సీఎం కేసీఆర్ యువతకు ఉపాధి కల్పించాలనే పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టారన్నారు.
కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదహారు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని విమర్శించారు. వెంటనే అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యగులు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తారని ప్రశ్నించారు. కేంద్రం వడ్లు కొనుగోలు పైన సంజయ్ రైతులకు సమాధానం చెప్పాలన్నారు.