హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మంత్రి హరీశ్రావు సిద్దిపేట, సింగారెడ్డి, మెదక్ జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. భారీ వర్షాల దృష్ట్యా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు హెడ్క్వార్టర్స్లోనే ఉండాలని ఆదేశించారు.
ఆయా జిల్లాల్లోని చెరువులు, పూర్తిగా నిండిన జలాశయాల్లో నీటిమట్టాలను పర్యవేక్షిస్తూ.. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేకంగా నిఘా వేసి, ప్రత్యేక చర్యలు చేపట్టాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. శిథిలావస్థ భవనాల్లో నివసించే ప్రజలను ఖాళీ చేయించి, తాత్కాలిక వసతి కల్పించాలని ఆదేశించారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున పశువులు, ఆవులు, ప్రజలు వెళ్లకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలపై కంట్రోల్ రూంకు వచ్చే సమస్యలపై తక్షణ స్పందించాలని, పూర్తిగా ఇండ్లు ధ్వంసమైన వారికి ప్రభుత్వ పరంగా అందించే ఆర్థిక సాయాన్ని వెంటనే అందేలా చూడాలని, బాధితులకు రేషన్ బియ్యం అందజేయాలని ఆదేశించారు.