హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రత్యేక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి ధాన్యం కస్టం మిల్లింగ్ సమయంలో అనవసర సమస్యలు సృష్టించొద్దని ఎఫ్సీఐ అధికారులను పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ఎఫ్సీఐ నాణ్యతా ప్రమాణాల మేరకే ముడి బియ్యం అందిస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్లోని పౌర సరఫరాల విభాగం భవన్లో ఎఫ్సీఐ తెలంగాణ ప్రాంతీ య జనరల్ మేనేజర్ దీపక్శర్మతో మంత్రి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలుపెట్టామని తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని అదనపు భారం భరించి ధాన్యాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లా ల్లో నూకల శాతం అధికంగా ఉన్నా, అభ్యంతరాలు లేకుండా తీసుకోవాలని కోరారు. గత యాసంగిలో తీసుకోవాల్సిన 5.25 లక్షల టన్నుల బియ్యాన్ని ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రూపంలో తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బియ్యాన్ని వేగంగా సరఫరా చేసేలా ర్యా కులు, అదనపు నిల్వ సామర్థ్యం కల్పించాలని కోరారు. సీఎంఆర్కు అదనపు గడువు కేవలం నెలరోజులే ఇవ్వడం సరికాదని అసంతృప్తి వ్యక్తంచేశారు.
నోడల్ అధికారులుగా కమలాకర్, రాజిరెడ్డి
ధాన్యం సేకరణలో ఇబ్బందులు తొలగించేందుకు ఎఫ్సీఐ డీజీఎం కమలాకర్, పౌర సరఫరాల సంస్థ జీఎం రాజిరెడ్డిని నోడ ల్ అధికారులుగా నియమిస్తామని మంత్రి గంగుల తెలిపారు. ధాన్యం సేకరణలో ఆర్థిక పరమైన అంశాలపై ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో మంత్రి చర్చించారు. శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 34 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసినట్టు చెప్పారు. ఈసారి 35.80 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, దాదాపు 60 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తున్నామని వివరించారు. ధాన్యం సేకరణకు 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని, వాటి కోసం జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశామని తెలిపారు. ఇంకా అవసరమైతే జెమ్ పోర్టల్తోపాటు బహిరంగ వేలం ద్వారా సేకరిస్తామని వెల్లడించారు.
పక్క రాష్ర్టాల నుంచి ధాన్యం వస్తే కఠిన చర్యలు