ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ వన దేవతలను పంచాయతీరాజ్ నీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారం దర్శింకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలను దర్శించుకోవడం సంతోషకరం అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సమ్మక్క-సారలమ్మల దీవెనలతో అభివృద్ధి పథంలో నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అమ్మల కృప ఉండాలని కోరుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కేసీఆర్ఎత్తు బంగారాన్ని అమ్మలకు సమర్పించారు.