వరంగల్ : పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆదేశించారు. ఆదివారం హన్మకొండలోని మంత్రి క్యాంప్ కార్యాలయం (ఆర్అండ్బీ గెస్ట్హౌస్)లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, మండల ప్రజాప్రతినిధులతో సమీక్ష జరిపారు. పీఎంజీఎస్ఐ, డీఎంఎఫ్టీ, సీసీరోడ్లు, డ్రైనేజీలు, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, సెబ్ సెంటర్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, బీటీ రోడ్ల పునర్నిర్మాణం, ఎస్డీఎఫ్, సీడీపీ ప్రతిపాదనలతో పాటు పలు అంశాలపై సమీక్షించారు.
నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చేస్తున్న కృషిలో సహకరించాలని పిలుపునిచ్చారు. నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను అందించేందుకు పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలోని కమ్యూనిటీ భవనాలు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి బీటీ రోడ్లు వేసేందుకు కృషి చేస్తున్నామని, కొత్త రోడ్ల నిర్మాణంతో పాటు దెబ్బతిన్న రోడ్లను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.