మహబూబాబాద్ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..వరంగల్ – ఖమ్మం రహదారిలో ఆదివారం రాత్రి నాంచారి మడూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
కాగా, అదే దారిలో వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి అగి మృతుడు నారి సోమన్న (35), కుటుంబాన్ని ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. దగ్గరుండి క్షతగాత్రుడిని వెంటనే వైద్య శాలకు తరలించారు. రోడ్డు ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రోడ్లపై ప్రయాణించే వారు తగు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు.